Ambedkar Jayanti 2021: దళితులను సీఎం కేసీఆర్‌ మోసం చేశారు- షర్మిల

Ambedkar Jayanti 2021: దళిత వ్యక్తిని తెలంగాణకు తొలి సీఎం చేస్తానని చెప్పి సీఎం కేసీఆర్ మోసం చేశారని వైఎస్ షర్మిల విమర్శించారు.

Update: 2021-04-14 15:38 GMT

Ambedkar Jayanti 2021: దళితులను సీఎం కేసీఆర్‌ మోసం చేశారు- షర్మిల

Ambedkar Jayanti 2021: దళిత వ్యక్తిని తెలంగాణకు తొలి సీఎం చేస్తానని చెప్పి సీఎం కేసీఆర్ మోసం చేశారని వైఎస్ షర్మిల విమర్శించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 130వ జయంతి సందర్భంగా బుధవారం లోటస్ పాండ్‌లో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ.. మూడు ఎకరాల భూమి ఏమయ్యిందో సమాధానం చెప్పాలన్నారు. చేవెళ్ల-ప్రాణహితకి దివంగత వైఎస్సార్ అంబేద్కర్ పేరు పెట్టారన్నారు. ఇప్పటి కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు ముఖ్యమంత్రి అంబేద్కర్ పేరు పెట్టలేక పోతున్నారని విమర్శించారు. నాగార్జున సాగర్ ఎన్నికలకు కొవిడ్ నిబంధనలు అడ్డు రావు అంబేద్కర్ జయంతి ఘనంగా చేయడానికి మాత్రం నిబంధనలు అడ్డు వస్తాయా? అని ప్రశ్నించారు.

Tags:    

Similar News