YS Sharmila: ప్రజా ప్రస్థానం పేరుతో షర్మిల పాదయాత్ర

* ప్రజాప్రస్థానం పాదయాత్ర చేవెళ్ల నుంచి ప్రారంభం * తెలంగాణలో ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేరలేదు

Update: 2021-09-20 11:45 GMT

 ప్రజా ప్రస్థానం పేరుతో షర్మిల పాదయాత్ర( ఫోటో-ది హన్స్ ఇండియా) 

Sharmila: తెలంగాణలో పాదయాత్రల సీజన్‌ కొనసాగుతుంది. ఇప్పటికే ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో బీజీపీ చీఫ్ పాత్ర చేస్తుంటే మరోపక్కన అక్టోబర్ 20 నుంచి వైఎస్‌ఆర్‌టీపీ పార్టీ తరుపున అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కూడా పాదయాత్ర చేయనున్నట్టు ప్రకటించారు. వైఎస్సార్ ప్రారంభించిన చేవెళ్ల నుంచి ప్రజాప్రస్థానం పేరుతో పాదయాత్ర చేయనున్నారు. ఈ పాదయాత్రలో ప్రజల సమస్యలు తెలుసుకోవడమే కాకుండా ప్రభుత్వ వైఫల్యాలు ఎండగట్టడం సమస్యల పరిష్కరానికి మార్గం చూపించేందుకు రెడీ అవుతున్నారు జీహెచ్ఎంసీ మినహా మిగతా అన్ని నియోజకవర్గాల్లో ఈ పాదయాత్ర ఉంటుందని వైఎస్ షర్మిల ప్రకటించారు.

Tags:    

Similar News