Sharmila: కృష్ణా జలాల అంశాలను కేసీఆర్‌ ఎప్పుడు సీరియస్‌గా తీసుకోలేదు

* తెలంగాణకు దక్కాల్సిన చుక్క నీటిబొట్టును వదులుకోమని స్పష్టం * ప్రజలకు అన్యాయం జరుగుతుందనే తెలంగాణలో పార్టీ పెట్టాను

Update: 2021-07-16 08:29 GMT

వైఎస్‌ షర్మిల (ఫైల్ ఫోటో)

YS Sharmila: కృష్ణా జలాల అంశాలను సీఎం కేసీఆర్‌ ఏనాడైనా సీరియస్‌గా తీసుకున్నారా అని వైఎస్ షర్మిల ప్రశ్నించారు. సమావేశాలకు పిలిస్తే పోవాల్సిన బాధ్యత లేదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణకు దక్కాల్సిన చుక్క నీటిబొట్టును వదులుకోమని స్పష్టం చేశారు. తెలంగాణలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అన్యాయం జరుగుతుందన్నారు. వైఎస్ రాజశేఖ‌ర్‌రెడ్డి ప్రేమించిన ప్రజలకు అన్యాయం జరుగుతుందనే తెలంగాణలో పార్టీ పెట్టానని షర్మిల అన్నారు.

Tags:    

Similar News