YS Sharmila: TSPSC కథ కంచికి చేరింది

YS Sharmila: కేటీఆర్ నిర్లక్ష్యం వల్లే ఈ స్కాం జరిగింది

Update: 2023-05-15 11:01 GMT

YS Sharmila: TSPSC కథ కంచికి చేరింది

YS Sharmila: TSPSC కథ కంచికి చేరిందని విమర్శలు గుప్పించారు వైఎస్ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. లీకుల సూత్రధారాలు నిర్ధోషులుగా బయటతిరుగుతుంటే... పాత్రధారులు బెయిల్‌పై బయటపడుతున్నారని ఆరోపించారు. 30 లక్షల మంది జీవితాలతో చెలగాటమాడిన అతిపెద్ద కుంభకోణం చివరకు బోర్డును కూడా కదిలించకలేకపోయిందన్నారు. ఐటీ శాఖ వైఫల్యం, కేటీఆర్ నిర్లక్ష్యం వల్లే ఈ స్కాం జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీబీఐ రంగంలోకి దిగితే దొరుకుతామని భయపడి.. సిట్‌తో సైలెంట్‌గా సెట్ చేశారని షర్మిల షర్మిల ట్వీట్ చేశారు.  




 


Tags:    

Similar News