హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో చంద్రమౌళి చికిత్స పొందుతున్న వైసీపీ నేత చంద్రమౌళిని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం పరామర్శించారు. ఇటీవల అనారోగ్యం బారినపడ్డ చంద్రమౌళి రెండు రోజుల కిందట అపోలోలో చేరారు. దీంతో విషయం తెలుసుకున్న జగన్ శుక్రవారం ఆయన్ను పరామర్శించారు. ఈ సందర్బంగా ఆరోగ్యం గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. వైఎస్ జగన్తో పాటు పార్టీ రాజ్యసభ సభ్యుడు వి. విజసాయి రెడ్డి, మాజీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, పుట్టపర్తి నియోజక వర్గ వైఎస్సార్ కాంగ్రెస్ సమన్వయ కర్త శ్రీధర్ రెడ్డి కూడా చంద్రమౌళిని పరామర్శించారు. కాగా చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున చంద్రమౌళి పోటీ చేశారు.