చనిపోతున్నానని వాట్సాప్లో మెసేజ్ పెట్టి ఓ యువతి అదృశ్యమైంది. ఈ ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది. ఘాన్సీబజార్కు చెందిన అమీనా సుల్తానా ప్రభుత్వ పాఠశాలలో టీచర్గా పనిచేస్తోంది. అయితే గత కొన్ని రోజులుగా ఆమె అనారోగ్యంబారిన పడింది. దీంతో తన కుమార్తె అలినా హమీద్(19)కు పెళ్లి చేయాలని సంబంధాలు చూడటం మొదలుపెట్టారు. అయితే తల్లిదండ్రులు చూసిన వ్యక్తిని పెళ్లి చేసుకోనని.. తాను నవాజ్ అనే వ్యక్తిని ప్రేమిస్తున్నానని తల్లిదండ్రులకు చెప్పింది. ఈ పెళ్ళికి వారు నిరాకరించారు.
దీంతో ఆమె అమీనా సుల్తానా నవాజ్కు ఫోన్ చేసి పెళ్లి చేసుకోవాలని కోరింది. అయితే అలినాను పెళ్లి చేసుకునేందుకు అతను నిరాకరించాడు. కొన్ని రోజుల క్రితం అలినా రిసాలాబజార్లో ఉంటున్న పిన్ని ఇంటికి వెళ్లింది. ప్రేమికుడి చేతిలో మోసపోయానని తల్లిదండ్రులకు చెప్పి తాను చనిపోతున్నట్లు వాట్సాప్లో మెసేజ్ పెట్టి బయటికి వెళ్లింది. భయాందోళన చెందిన తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అలినా ఆచూకి కోసం చేసిన ప్రయత్నాలు చేస్తున్నారు.