రేపు ప్రధాని టూర్‌లో కేసీఆర్‌ పాల్గొంటారా..? పాల్గొనరా..? అనే దానిపై ఉత్కంఠ

PM Modi: మోడీ సభలో సీఎం కేసీఆర్‌ స్పీచ్‌కు సమయం

Update: 2023-07-07 08:33 GMT

రేపు ప్రధాని టూర్‌లో కేసీఆర్‌ పాల్గొంటారా..? పాల్గొనరా..? అనే దానిపై ఉత్కంఠ

PM Modi: రేపు తెలంగాణలో పర్యటించనున్నారు ప్రధాని మోడీ. వరంగల్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం.. హనుమకొండ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కాలేజీ మైదానంలో బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. ఇదిలా ఉంటే.. మోడీ సభలో సీఎం కేసీఆర్‌ స్పీచ్‌కు 5 నిమిషాల సమయం కేటాయించారు. గతంలో మోడీ హైదరాబాద్‌ పర్యటనలోనూ కేసీఆర్‌ ప్రసంగానికి సమయం కేటాయించారు.

అప్పుడు సీఎం కేసీఆర్‌ ఆ సభకు హాజరుకాలేదు. ఇప్పుడు మరోసారి మోడీ టూర్‌లో సీఎం కేసీఆర్‌ ప్రసంగానికి సమయం కేటాయించడంతో ఆసక్తి నెలకొంది. మరి రేపు ప్రధాని టూర్‌లో కేసీఆర్‌ పాల్గొంటారా..? పాల్గొనరా..? అనే దానిపై ఉత్కంఠ నెలకొంది.

Tags:    

Similar News