Uttam Kumar Reddy: కేసీఆర్‌ పాలనలో అధిక వడ్డీలకు అప్పులు తెచ్చారు

Uttam Kumar Reddy: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి పలు ఆరోపణలు చేశారు.

Arun Chilukuri
Published on: 29 Dec 2025 4:07 PM IST
Uttam Kumar Reddy: కేసీఆర్‌ పాలనలో అధిక వడ్డీలకు అప్పులు తెచ్చారు
X

Uttam Kumar Reddy: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి పలు ఆరోపణలు చేశారు. కేసీఆర్‌ పాలనలో ఎక్కువ మిత్తిలకు అప్పులు తెచ్చారని ఆయన విమర్శించారు. 70వేల కోట్లు అయ్యే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు.. 27వేల కోట్లు ఖర్చు చేశారని అన్నారు. బీఆర్‌ఎస్‌ పాలనలో కేవలం 36శాతం పనులు మాత్రమే అయ్యాయన్నారు. కేసీఆర్‌కు కాళేశ్వరంపై ఎందుకంత మోజు.. పాలమూరుపై ఎందుకు అంత నిర్లక్ష్యమని ప్ర‎శ్నించారు. పాలమూరు రంగారెడ్డికి కేసీఆర్‌ వ్యతిరేకంగా పనిచేసి ఇప్పుడు నీతి మాటలు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story