గవర్నర్తో ఆర్టీసీ జేఏసీ నేతల భేటీ..కేకే మధ్యవర్తిత్వం వహిస్తే చర్చలకు..
ఆర్టీసీ జేఏసీ నాయకులు రాజ్భవన్లో గవర్నర్ తమిళిసైని కలిశారు. కార్మికుల పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ఈ సందర్భంగా గవర్నర్కు వివరించారు. అలాగే సమ్మెతో పాటు కార్మికుల ఆత్మహత్యలపై జేఏసీ నేతలు తమిళిసైకి ప్రధానంగా వివరించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ జేఏసీ కన్వినర్ అశ్వత్థామరెడ్డి మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కేకే మధ్యవర్తిత్వం వహిస్తే చర్చలకు సిద్ధమని ప్రకటించారు.