హైదరాబాద్‌లో 24 గంటలు నీటి సరఫరా బంద్

హైదరాబాద్ నగర వాసులు నీటి ఎద్దడిని ఎదుర్కోబోతున్నారు. నగరానికి కృష్ణా జలాలను తరలిస్తున్న కృష్ణా ఫేజ్ 1 పైపులైన్‌కు భారీగా లీకేజీలు ఏర్పడ్డాయని జలమండలి అధికారులు తెలిపారు.

Update: 2020-02-22 08:42 GMT

హైదరాబాద్ నగర వాసులు నీటి ఎద్దడిని ఎదుర్కోబోతున్నారు. నగరానికి కృష్ణా జలాలను తరలిస్తున్న కృష్ణా ఫేజ్ 1 పైపులైన్‌కు భారీగా లీకేజీలు ఏర్పడ్డాయని జలమండలి అధికారులు తెలిపారు. కృష్ణా ఫేజ్‌-1 2200, 1200 డయా ఎంఎస్‌ పైపులైన్‌ పలుచోట్ల లీకేజీలు ఏర్పడడంతో వీటి మరమ్మతులకు చేయనున్నారు. ఇందుకు గాను ఈ నెల 24 (సోమవారం) ఆరు గంటల నుంచి 25వ తేదీ ఉదయం ఆరుగంటల వరకు మరమ్మతు పనులను కొనసాగించనున్నారు.

ఇందులో భాగంగానే మిరా లం, అస్మాన్‌ఘాడ్‌, దిల్‌సుఖ్‌నగర్‌, వినయ్‌నగర్‌, సైదాబాద్‌, చంచల్‌గూడ, కృష్ణబాగ్‌, బాల్‌ శెట్టిఖేత్‌, అలీబైల్‌ కాలనీ, అలీయాబాద్‌, హాషంబాద్‌, అడిక్‌మెట్‌, శివం, రియాసత్‌ నగర్‌, సంతోష్‌నగర్‌, యాకుత్‌పుర, మెహబూబ్‌ మాన్షన్‌, బొగ్గులకుంట, అఫ్జల్‌గంజ్‌, హిందీనగర్‌, నారాయణగూడ, చిలకలగూడ, హైదర్‌గూడ రిజర్వాయర్‌ ప్రాంతాల్లో నీటి సరఫరాను 24 గంటల పాటు నగరంలో మంచినీటి సరఫరాను నిలిపివేస్తున్నారని స్పష్టం చేసారు.

ఈ అంతరాయాన్ని ప్రజలు గమనించగలరని తెలిపారు. ఈ స్వల్ప అంతరాయాన్ని దృష్టిలో పెట్టుకొని వినియోగదారులు నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని సూచించారు. 



Tags:    

Similar News