వరంగల్‌ 9 హత్యల కేసు.. నిందితుడికి ఉరి శిక్ష

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వరంగల్‌ 9 హత్యల కేసులో జిల్లా కోర్టు తుది తీర్పు వెల్లడించింది. బీహార్‌కు చెందిన నిందితుడు సంజయ్‌కుమార్‌కు ఉరి శిక్ష వేస్తూ సంచలన తీర్పును ఇచ్చింది కోర్టు

Update: 2020-10-28 09:36 GMT

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వరంగల్‌ 9 హత్యల కేసులో జిల్లా కోర్టు తుది తీర్పు వెల్లడించింది. బీహార్‌కు చెందిన నిందితుడు సంజయ్‌కుమార్‌కు ఉరి శిక్ష వేస్తూ సంచలన తీర్పును ఇచ్చింది కోర్టు .. హత్యలు చేసినట్టు జడ్జి ముందు నిందితుడు సంజయ్‌ ఒప్పుకోవడంతో నేరం రుజువు అయినట్లు జిల్లా కోర్టు ప్రకటించింది. మే 21న గొర్రెకుంటలో 9 మందికి మత్తు మందు ఇచ్చి స్పృహ కోల్పోయిన అనంతరం సజీవంగా బావిలో పడేసి హత్య చేశాడు నిందితుడు. ఈ ఘటనలో నిందితుడిపై 7 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు పోలీసులు. 

Tags:    

Similar News