Kamareddy: కామారెడ్డి జిల్లాలో బోర్డు తిప్పేసిన విఎస్ విపీ కంపెనీ

*సుమారు రు.10 కోట్లు వసూలు చేసిన నిర్వాహకులు *600 మంది కస్టమర్లను మోసం చేసిన కంపెనీ *లబోదిబోమంటున్న కస్టమర్లు

Update: 2021-11-08 05:57 GMT

కామారెడ్డి జిల్లాలో బోర్డు తిప్పేసిన విఎస్ విపీ కంపెనీ(ఫైల్ ఫోటో)

Kamareddy: కామారెడ్డి జిల్లా దేవునిపల్లిలో ఓ ప్రైవేట్ కంపెనీ వినియోగదారులను నిండా ముంచింది. తక్కువ ధరకే బైకులు, ఫోర్ వీలర్ వాహనాలు, జేసీబీలు, క్రేన్లు ఇప్పిస్తామంటూ భారీ మోసానికి పాల్పడింది. సుమారు పది కోట్ల రూపాయలు వసూలు చేసి బోర్డు తిప్పేసింది. డబ్బు చెల్లించినా తమకు వాహనాలు ఇవ్వకపోవడంతో మోసపోయామని గుర్తించిన వినియోగదారులు లబోదిబోమంటున్నారు. దేవునిపల్లి పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేశారు. 

Tags:    

Similar News