ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కి ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఫోన్..

Update: 2020-05-11 12:01 GMT

భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కి ఫోన్ చేశారు ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు. కరోననా నేపథ్యంలో ఎంపీ కోమటి రెడ్డి కుటుంబ సభ్యుల యోగక్షేమలు అడిగి తెలుసుకున్నారు. భువనగిరి పార్లమెంట్ పరిధిలో సహాయ కార్యక్రమాలు గురించి ఆరా తీశారు ఉప రాష్ట్రపతి వెంకయ్య. భువనగిరి పార్లమెంట్ పరిధిలో కరోనా నివారణ చర్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నిత్యావసర వస్తువులు పంపిణీ, సహాయక చర్యలు కూడా అందించామని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వెల్లడించారు. ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరికి కోమటిరెడ్డి బ్రదర్స్ అండగా నిలుస్తున్నామని ఉపరాష్ట్రపతి కి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వివరించారు.

Tags:    

Similar News