హుజుర్నగర్ ఉప ఎన్నిక రాష్ట్ర చరిత్రను తిరగరాస్తుందన్నారు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. కేసీఆర్ కుటుంబం రాష్ట్రాన్ని దోచుకుంటుందని ఆరోపించారు. హుజుర్నగర్లో ఏం అభివృద్ధి చేశారో క్షేత్రస్థాయిలో టీఆర్ఎస్ చెప్పాలని డిమాండ్ చేశారు. అధికారం, డబ్బు, మద్యంతో టీఆర్ఎస్ ప్రలోభాలకు పాల్పడుతోందన్నారు. ఉప ఎన్నికను కేంద్ర బలగాలతో నిర్వహించాలని కోరారు.