హైదరాబాద్ ఎల్బీనగర్లో కారు బీభత్సం సృష్టించింది. ఈ ఘటనలో ఇద్దరు మహిళలకు తీవ్ర గాయాలు కాగా ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనలో గాయపడిన వారిని వెంకటమ్మ, సత్తమ్మగా గుర్తించారు.
వీరిలో వెంకటమ్మ పరిస్థితి విషమంగా ఉండటంతో ఆమెను స్థానిక ఆసుపత్రికి తరలించారు. అతివేగంగా దూసుకొచ్చిన కారు ఇద్దరిని ఢీకొట్టి అనంతరం మెట్రో పిల్లర్ను ఢీకొట్టిందని ప్రత్యక్ష సాక్ష్యులు చెబుతున్నారు. బయో డైవర్సిటీ ప్లైఓవర్ ప్రమాదం మరిచిపోకముందే మళ్లీ అదే విధంగా ప్రమాదం జరిగింది. అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్ ప్రాణాలు తీస్తున్నాయి.