డివైడర్ను ఢీకొని ఇద్దరు యువకులు మృతి
బైక్ పై వెళుతూ డివైడర్ ను ఢీకొనడంతో ఇద్దరు అక్కడిక్కడే మృతి చెందిన ఘటన సంగారెడ్డి జిల్లా కంది మండలం కౌలంపేట ఎన్హెచ్-65 జాతీయ రహదారిపై చోటు చేసుకుంది.
బైక్ పై వెళుతూ డివైడర్ ను ఢీకొనడంతో ఇద్దరు అక్కడిక్కడే మృతి చెందిన ఘటన సంగారెడ్డి జిల్లా కంది మండలం కౌలంపేట ఎన్హెచ్-65 జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. రూరల్ ఎస్ఐ శ్రీకాంత్ తెలిపిన వివరాల ప్రకారం.. కంది మండలం కొయ్యగుండు తాండకు చెందిన నేనావత్ ప్రవీణ్ (27), ఇదే గ్రామానికి చెందిన నేనావత్ హరిసింగ్ (27) వీరిద్దరు శుక్రవారం బైక్ పై గణేశ్గడ్డ నుంచి సంగారెడ్డివైపు వెళుతున్నారు. కౌలంపేట వెంకటేశ్వర ఆలయం వద్దకు రాగానే ఒక్కసారిగా వీరి ద్విచక్రవాహనం డివైడర్ను ఢీ కొనడంతో ఇద్దరికి తలకు బలమైన గాయాలై అక్కడిక్కడే చనిపోయారు. మృత దేహాలను పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.