Karimanagar: బ్యాలెట్ బ్యాగులతో వెళ్తున్న రెండు బస్సులకు ప్రమాదం..19మందికి గాయాలు

Update: 2025-02-28 04:09 GMT

 Karimanagar: ఎన్నికల విధులు నిర్వహించుకుని బ్యాలెట్ బాక్సులు అప్పగించేందుకు వెళ్తున్న రెండు ఆర్టీసీ బస్సులు ప్రమాదానికి గురయ్యాయి. దీంతో ఎన్నికల సిబ్బందికి గాయాలయ్యాయి. కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్ , నిజామాబాద్ పట్టభద్రుల, ఉపాధ్యాయుల నియోజకవర్గాల్లో గురువారం సాయంత్రం ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిసాయి. బ్యాలెట్ బాక్సులను కరీంనగర్ లో అప్పగించేందుకు నిర్మల్ జిల్లా సిబ్బంది రెండు బస్సుల్లో వెళ్తుండగా..జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం నమిళికొండ దగ్గర నిర్మల్, బాన్సువాడకు చెందిన రెండు బస్సులు ఢీకున్నాయి. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న 19 మంది సిబ్బందికి గాయాలయ్యాయి.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను కరీంనగర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బస్సు డ్రైవర్ మోయినొద్దీన్, సిబ్బంది పురుషోత్తంకు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారిని కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి, పలువులు అధికారులు పరామర్శించి పరిస్థితిని సమీక్షించారు. ఇద్దరు మినహా మిగతా వారంతా స్పల్పంగా గాయపడినట్లు అధికారులు తెలిపారు.

Tags:    

Similar News