Nagarjuna Sagar: మలుపులు తిరుగుతున్న సాగర్‌ రాజకీయాలు

Nagarjuna Sagar: సాగర్‌ ఉపఎన్నిక బరిలో 41 మంది అభ్యర్థులు

Update: 2021-04-04 01:35 GMT

ఫైల్ ఇమేజ్ 

Nagarjuna Sagar: నాగార్జున సాగర్‌ ఉపఎన్నికల బరిలో కీలక నామినేషన్ల ఘట్టం ముగిసింది. చివరకు ఉపఎన్నికల బరిలో మొత్తంగా 41 మంది అభ్యర్థులు నిలిచారు. అభ్యర్థులెవరనేది నికరంగా లెక్కతేలడంతో సాగర్‌ రాజకీయాలు కీలక మలుపులు తిరుగుతున్నాయి. ఇక నామినేషన్లు వేసిన ప్రధాన పార్టీల అభ్యర్థులు ఇప్పటికే తమ ప్రచారాల జోరును పెంచారు.

సాగర్‌ ఉపఎన్నికలో ఎలాగైనా గెలిచి తీరాలని టీఆర్ఎస్‌, బీజేపీ పట్టుమీద ఉన్నాయి. జనసేనానిని కూల్‌ చేసి సాగర్‌లో ప్రచారం చేయించుకోవడం ద్వారా లబ్ధి పొందాలని తెలంగాణ బీజేపీ నేతలు పావులు కదువుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు సాగర సమరంలో సై అంటే సై అంటోంది కాంగ్రెస్‌. బస్తీమే సవాల్‌ అంటూ కాంగ్రెస్‌ అభ్యర్థి జానా రెడ్డి కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. ప్రచారానికి వెళ్లకుండా పోలింగ్‌కి వెళ్లి ఎవరు గెలుస్తారో వారిదే నిజమైన గెలుపు అంటున్నారు జానారెడ్డి.

Tags:    

Similar News