ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో మరో మూడు ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలయ్యాయి. సమ్మెను విరమింపజేయాలని, ప్రభుత్వం చర్చలు జరపాలని ప్రయాణీకులకు ప్రజా రవాణా సౌకర్యం కల్పించాలంటూ వివిధ రకాల కారణాలతో పిల్ దాఖలయ్యాయి. విచారణకు స్వీకరించిన హైకోర్టు ప్రభుత్వానికి, ఆర్టీసీ కార్మిక సంఘాలకు నోటీసులు జారీ చేసింది. అన్ని పిటీషన్లపై ఈ నెల 28 న వాదనలు వింటామని హైకోర్టు స్పష్టం చేసింది.