29వ రోజు కొనసాగుతోన్న ఆర్టీసీ సమ్మె..పలు కీలక అంశాలపై చర్చించనున్న సీఎం కేసీఆర్

Update: 2019-11-02 04:42 GMT
Tsrtc Strike

ఆర్టీసీ సమ్మె 29వ రోజు కొనసాగుతోంది. ఇవాళ అన్ని డిపోల వద్ద జేఏసీ పిలుపు మేరకు నిరసన ర్యాలీలు చేపట్టనున్నారు. ఉదయం 11 గంటలకు విపక్ష పార్టీలతో ఆర్టీసీ జేఏసీ సమావేశం జరగనుంది. ఈ భేటీలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉంది.

ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. కేసీఆర్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో 30 కీలక అంశాలపై చర్చించనున్నారు. ఆర్టీసీ పాలసీని సమూలంగా మార్చే విధంగా కేబినెట్ నిర్ణయం ఉండబోతోందని తెలుస్తోంది. ప్రైవేటు బస్సులు, ప్రైవేట్ రూట్లపై కూడా కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది.

Tags:    

Similar News