పంజాబ్‌ రైతాంగం రాహుల్‌ను ఈడ్చి తన్నింది - మంత్రి హరీష్‌రావు

Harish Rao - Rahul Gandhi: రైతు సంఘర్షణ సభ కాదు.. రాహుల్‌ సంఘర్షణ సభ...

Update: 2022-05-07 06:45 GMT

పంజాబ్‌ రైతాంగం రాహుల్‌ను ఈడ్చి తన్నింది - మంత్రి హరీష్‌రావు

Harish Rao - Rahul Gandhi: కాంగ్రెస పార్టీ రైతు డిక్లరేషన్‌ను పంజాబ్ రైతులే నమ్మలేదని, చైతన్యవంతులైన తెలంగాణ రైతులు ఎలా నమ్ముతారని రాహుల్ గాంధీని మంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు. అది రైతు సంఘర్షణ సభ కాదని, రాహుల్ సంఘర్షణ సభ అని తెలంగాణ ప్రజానికం భావిస్తున్నదని చెప్పారు. వ్యవసాయ ప్రాధాన్య రాష్ట్రమైన పంజాబ్ రైతాంగమే మిమ్మల్ని ఈడ్చి తన్నిందని ట్విటర్ వేదికగా రాహుల్ గాంధీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ సబ్బండ వర్గాల సంక్షేమం కోసం నిరంతరం పనిచేసే ఏకైక పార్టీ టీఆర్‌ఎస్ మాత్రమేనని మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు.




Full View


Tags:    

Similar News