ఢిల్లీలో తెలంగాణ గవర్నర్ తమిళిసై.. ధాన్యం కొనుగోళ్లపై మోడీ, పీయూష్‌ను కలిసే ఛాన్స్...

Tamilisai Soundararajan: ప్రాధాన్యతను సంతరించుకున్న తమిళిసై, కేసీఆర్ హస్తిన టూర్...

Update: 2022-04-06 04:36 GMT

ఢిల్లీలో తెలంగాణ గవర్నర్ తమిళిసై.. ధాన్యం కొనుగోళ్లపై మోడీ, పీయూష్‌ను కలిసే ఛాన్స్...

Tamilisai Soundararajan: కొన్ని రోజులుగా వరి ధాన్యం కొనుగోళ్లపై తెలంగాణ రాజకీయాలు వాడీవాడేగా సాగుతున్నాయి. అదేవిధంగా ప్రగతిభవన్, రాజ్‌భవన్ మధ్య కూడా కాస్త గ్యాప్ పెరిగింది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ గవర్నర్ ఢిల్లీ టూర్ ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇవాళ తమిళిసై కేంద్ర మంత్రి అమిత్ షాతో సమావేశమయ్యే అవకాశం ఉంది. మరోవైపు యాసంగి ధాన్యం కేంద్రమే కొనాలని పట్టుబడుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్, ఢిల్లీలో పర్యటనలో ఉన్నారు. తెలంగాణకు తిరుగు ప్రయాణంలోపు సీఎం కేసీఆర్ ధాన్యం కొనుగోళ్లపై ప్రధాని మోడీ, పీయూష్ కలిసే ఛాన్స్ ఉంది.

Tags:    

Similar News