తెలంగాణ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. కొత్త జిల్లాల్లో టీఆర్ఎస్ కార్యాలయాల నిర్మాణానికి స్థలాల కేటాయింపు చేస్తూ నిర్ణయం తీసుకుంది. అదే విధంగా విశాఖ శారదా పీఠం కోసం స్థలాన్ని కేటాయిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. సినీ దర్శక నిర్మాత ఎన్.శంకర్కు 10 నుంచి 15 ఎకరాల స్థలం కేటాయిస్తూ కేబినెట్ నిర్ణయించింది. నేషనల్ పోలీస్ అకాడమీలో క్వార్టర్ల నిర్మాణానికి 2 ఎకరాల స్థలం కేటాయించింది. ఖైదీల విషయంలో కూడా కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. మహాత్మా గాంధీ 150 వ జయంతి సందర్భంగా 14 మంది జీవిత ఖైదీలకు స్పెషల్ రెమిషన్ ఇవ్వాలని నిర్ణయించింది.