హుజూర్‌నగర్‌లో సైదిరెడ్డిదే గెలుపు : మంత్రి జగదీశ్ రెడ్డి

Update: 2019-09-21 15:36 GMT

హుజుర్‌నగర్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి గెలుపు ఖాయమన్నారు మంత్రి జగదీశ్ రెడ్డి. అభివృద్ధిలో హుజుర్‌నగర్ నియోజకవర్గం వెనుకబడటానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి కారణమన్నారు. కాంగ్రెస్ నేతలంతా కలిసి వచ్చినా టీఆర్‌ఎస్ విజయాన్ని ఆపలేరని ఆయన అన్నారు. కాంగ్రెస్ నేతల ఐక్యత పీతల కలయిక వంటిదని ఆయన విమర్శించారు. ఉత్తమ్‌కుమార్ రెడ్డి హుజూర్‌నగర్‌లో స్థానికేతరుడని, ఆయన ఆటలిక్కడ ఏమి సాగవన్నారు. పోటీ ఏమైనా ఉంటే కాంగ్రెస్‌తోనే కానీ, బీజేపీ ప్రభావం ఏ మాత్రం ఉండదన్నారు. టీఆర్‌ఎస్‌ను గెలిపించేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారని ఈ సందర్భంగా మంత్రి అన్నారు.

Tags:    

Similar News