బీజేపీది నియంతృత్వ ధోరణి అని అధికార యావ అని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ ఆరోపించారు. అన్ని రాష్ట్రాల్లో అధికారంలో ఉండాలని అనుకుంటుందని తెలంగాణను ఒక రాజకీయ క్షేత్రంగానే చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు కర్నె ప్రభాకర్. ఒకప్పుడు తెలంగాణ పథకాలను పొగిడిన కేంద్రంలోని పెద్దలు ఇప్పుడు విమర్శలు చేయడం ద్వంద్వ ధోరణికి చిహ్నం అని అన్నారు.