కేసీఆర్ తనకు ఏ పని అప్పగించినా బాధ్యతగా చేస్తానని మాజీ ఉపముఖ్యమంత్రి రాజయ్య అన్నారు. ఉద్యమం సమయంలో ఎవ్వరికీ ఇవ్వని గౌరవం కేసీఆర్ తనకు ఇచ్చారని రాజయ్య గుర్తుచేసుకున్నారు. స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గానికే పరిమితమైన తనకు తెలంగాణ రాజయ్యగా గుర్తింపు ఇచ్చారని రాజయ్య అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో తనను ఓడించేందుకు కొన్ని దుష్టశక్తులు ప్రయత్నం చేసినా కేసీఆర్, కేటీఆర్ ఎంతగానో ప్రోత్సహించి ఎమ్మెల్యేగా గెలిపించారని రాజయ్య తెలిపారు. కేసీఆర్, కేటీఆర్ రుణం తీర్చుకోడానికి ఈ జీవితం సరిపోదని రాజయ్య అన్నారు.