కేటీఆర్ పై అడ్డగోలు విమర్శలు చేస్తున్న పీసీసీ చీఫ్ ఉత్తమ్ ది నోరా మోరా అని టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ప్రశ్నించారు. రాజకీయాల్లో కేటీఆర్ బచ్చా అయితే కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఏమిటాని ఆయన నిలదీశారు. సైన్యంలో పని చేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి క్రమశిక్షణారాహిత్యంగా మాట్లాడుతున్నారని జీవన్ రెడ్డి మండిపడ్డారు. ఇక, కేసీఆర్ది కుటుంబపాలన అంటున్నారు మరి కాంగ్రెస్ పార్టీది ఏంటి? అని మండిపడ్డారు. మరోవైపు గత ఎన్నికల్లో కోదాడలో ఓడిపోయిన పద్మావతి రెడ్డికి హుజూర్నగర్ టికెట్ కేటాయించడాన్ని ఎద్దేవా చేసిన జీవన్ రెడ్డి హుజూర్నగర్లో పద్మావతి ఓడిపోవడం ఖాయమని ఓడిపోయిన తర్వాత ఆమెకు మున్సిపల్ ఎన్నికల్లో టికెట్ ఇచ్చినా ఆశ్చర్యం లేదంటూ సెటైర్లు వేశారు.