మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్న టీఆర్ఎస్ !

మహారాష్ట్రలోని నాందేడ్‌ జిల్లాలో 5 నియోజకవర్గాల్లో పోటీ చేయాలని ఆపార్టీ నేతలు ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కోరారు. టీఆర్‌ఎస్‌ పోటీకి సీఎం కేసీఆర్‌ అంగీకరించారు.

Update: 2019-09-17 12:07 GMT

తెలంగాణ రాష్ట్ర సమితి ( టీఆర్ఎస్ ) మొదటి సారి మరో రాష్ట్రంలోని ఎన్నికల్లో పోటీపడనుంది. మహారాష్ట్రలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బరిలో దిగాలని గులాబీ బాస్ కేసీఆర్ ఆ పార్టీ నాయకులకు సూచించారు. గతంలో నాందేడ్‌ జిల్లాలోని 6 నియోజకవర్గాలను తెలంగాణలో కలపాలని నేతలు ఉద్యమించిన సంగతి తెలిసిందే.. అయితే ఈ మేరకు టీఆర్‌ఎస్‌ పోటీ చేసేందుకు సీఎం కేసీఆర్‌ అంగీకరించారు. 

Tags:    

Similar News