హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో మంత్రి పువ్వాడ అజయ్ కాన్వాయ్కి ప్రమాదం జరిగింది. ప్రమాదం నుంచి మంత్రి పువ్వాడ తృటిలో తప్పించుకున్నారు. ట్రాఫిక్ పోలీసులను తప్పించుకునే క్రమంలో మంత్రి కాన్వాయ్లోని వాహనాన్ని ఢీకొంది ఓ బైక్.
ఈ సంఘటన పంజాగుట్టలోని జీవీకే మాల్ దగ్గర చోటు చేసుకుంది. కాన్వాయ్లోని వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో మంత్రి అజయ్ కాన్వాయ్లోని నాలుగు వాహనాలు దెబ్బతిన్నాయి. దీంతో ఆయన మరో వాహనంలో వెళ్లిపోయారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.