Secunderabad: సికింద్రాబాద్ లో విషాదం.. కూతుళ్లకు స్లీపింగ్ ట్యాబ్లెట్స్ ఇచ్చి.. ఆత్మహత్య చేసుకున్న తండ్రి
Secunderabad: తండ్రి, కూతుళ్ల ఆత్మహత్యపై పోలీసుల దర్యాప్తు
Secunderabad: సికింద్రాబాద్ లో విషాదం.. కూతుళ్లకు స్లీపింగ్ ట్యాబ్లెట్స్ ఇచ్చి.. ఆత్మహత్య చేసుకున్న తండ్రి
Secunderabad: సికింద్రాబాద్ బోయిన్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటు చేసుకుంది. భవానీనగర్ లో కుటుంబ కలహాల నేపథ్యంలో తండ్రీ.. ఇద్దరు పిల్లలతో సహా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన కూతుర్లకు నిద్రమాత్రలు ఇచ్చి అనంతరం తండ్రి కూడా నిద్రమాత్రలు వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో విషాదఛాయలు అలుముకున్నాయి. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ముగ్గురు మృతదేహాలను గాంధీ ఆస్పత్రికి తరలించారు. క్లూస్ టీమ్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులు మృతుడి భార్య నుంచి వివరాలు సేకరించారు.