రాజ్భవన్ రూట్లో ట్రాఫిక్ ఆంక్షలు
నేడు స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గవర్నర్ రాజ్భవన్లో ప్రత్యేక కార్యక్రమాలు జరుగనున్నాయి. ఈ సందర్భంగా రాజ్భవన్ రోడ్డులో సాయంత్రం 4.30 గంటల నుంచి రాత్రి 8గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు సీపీ (ట్రాఫిక్) అనిల్కుమార్ వెల్లడించారు.
నేడు స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గవర్నర్ రాజ్భవన్లో ప్రత్యేక కార్యక్రమాలు జరుగనున్నాయి. ఈ సందర్భంగా రాజ్భవన్ రోడ్డులో సాయంత్రం 4.30 గంటల నుంచి రాత్రి 8గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు సీపీ (ట్రాఫిక్) అనిల్కుమార్ వెల్లడించారు. ఈ నేపథ్యంలో నిర్ణీత సమయంలో ఖైరతాబాద్ జంక్షన్ నుంచి సోమాజిగూడ రాజీవ్గాంధీ విగ్రహం వరకు రోడ్డుకు రెండు వైపుల వెళ్లే సాధారణ వాహనాలు ప్రత్యామ్నాయ రూట్లలో వెళ్లాలని సూచించారు. సాయంత్రం 5.30 గంటలకు ఇచ్చే తేనేటి విందుకు ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి తదితర ప్రముఖులు హాజరుకానున్నారని నగర ట్రాఫిక్ అదనపు పోలీస్ కమిషనర్ అనిల్కుమార్ తెలిపారు.