పై చేయి సాధించిన రేవంత్ రెడ్డి.. ఒంటరైన కోమటిరెడ్డి బ్రదర్స్...

Revanth Reddy - Komatireddy Brothers: ఎంపీ ఉత్తమ్ కుమార్‌రెడ్డి సైతం గైర్హాజరు...

Update: 2022-04-29 06:58 GMT

పై చేయి సాధించిన రేవంత్ రెడ్డి.. ఒంటరైన కోమటిరెడ్డి బ్రదర్స్...

Revanth Reddy - Komatireddy Brothers: నల్గొండ జిల్లా పర్యటనలో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పై చేయి సాధించారు. నాలుగు రోజులుగా నల్గొండ పర్యటనపై సస్పెన్స్ నెలకొంది. సీనియర్ నేత జానారెడ్డితో రేవంత్ రెడ్డి లాభీయింగ్ సక్సెస్ అయింది. నాగార్జునసాగర్‌లో రాహుల్ గాంధీ సభపై సన్నాహక సమావేశంలో రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. మరోవైపు ఈ సమావేశానికి కోమటిరెడ్డి బ్రదర్స్ దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది.

ఎంపీ ఉత్తమ్ కుమార్‌రెడ్డి సైతం గైర్హాజరయ్యారు. తన పార్లమెంట్‌ పరిధిలో సమావేశం జరుగుతుండటంతో ఉత్తమ్ రాలేక పోతున్నట్లు తెలుస్తోంది. ఇక నాగార్జున సాగర్‌లో జరిగే సమావేశంలో మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, మూడు జిల్లాల పార్టీ అధ్యక్షులు పాల్గొననున్నారు.

Tags:    

Similar News