Revanth Reddy: కాంగ్రెస్ హయాంలోనే ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం జరిగింది

Revanth Reddy: ఔటర్ రింగ్ రోడ్డును కేటీఆర్ మిత్రబృందం ఆదాయవనరుగా వాడుకుంటోంది

Update: 2023-04-29 11:03 GMT

Revanth Reddy: కాంగ్రెస్ హయాంలోనే ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం జరిగింది

Revanth Reddy: 2004లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాతే హైదరాబాద్‌లో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణం జరిగిందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్‌కు మణిహారంగా ఉన్న ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం కాంగ్రెస్ హయాంలోనే జరిగిందన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం జరిగిందని తెలిపారు. విమానాశ్రయం, ఔటర్ రింగ్ రోడ్డు ప్రమాణికంగానే హైదరాబాద్‌కు పెట్టుబడులు పెరిగాయని తెలిపారు. గత నాలుగేళ్ల నుంచి ఔటర్ రింగ్ రోడ్డు టోల్‌‌ను ఈగల్ ఇన్ఫ్రాకు కట్టబెట్టారని... ఔటర్ రింగ్ రోడ్డును ఆదాయ వనరుగా కేటీఆర్ మిత్రబృందం వాడుకుంటోందని రేవంత్ రెడ్డి ఆరోపణలు చేశారు.

Tags:    

Similar News