Telangana: కుమ్రంభీం జిల్లా బేజ్జురు మండలంలో పెద్దపులి కలకలం

Telangana: ప్రజలకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్న పెద్దపులి

Update: 2021-02-27 06:47 GMT
కొమురంభీం జిల్లా లో పెద్దపులి 

Telangana: కుమ్రంభీం జిల్లా బేజ్జురు మండలంలో పెద్దపులి కలకలం రేపింది. రోజూ ఏదో ఒక చోట పశువులపై దాడి చేసి.. ప్రజలకు కంటిమీద కునుకులేకుండా చేస్తుంది. దాంతో సమీప గ్రామస్తులు ఆందోళనకు గురవుతున్నారు. బెజ్జూరు మండలం కుంటలమానెపల్లిలో తెల్లవారుజామున రెండు పశువులపై దాడి చేసి హతమార్చింది. పులి వరుస దాడులతో అక్కడి ప్రజలు భయాందోళనకు లోనవుతున్నారు. ఈ రెండు పులులను పట్టుకునేందుకు అటవీ సిబ్బంది ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. 20 మంది సిబ్బందితో కలిసి ప్రత్యేక క్యాంపు ఏర్పాటు చేసుకుని పులి కోసం అటవీ సిబ్బంది అధికారులు గాలిస్తున్నారు.

Tags:    

Similar News