టిక్ టాక్ సరదా... నదిలో గల్లంతైన యువకుడు

నిజామాబాద్ జిల్లాలో టిక్ టాక్ సరదా ముగ్గురు యువకుల ప్రాణాల మీదకు తెచ్చింది. జిల్లాలోని గొప్పల చెక్ డ్యాంలో టిక్ టాక్ చేస్తూ దినేష్ అనే వ్యక్తి పడిపోయాడు. సరదగా ముగ్గురు యువకులు వాగులోకి దిగి వీడియోలు తీసుకొన్నారు. అయితే వాగులో వరద పెరగడంతో ఆ యువకులు కొట్టుకుపోయారు.

Update: 2019-09-22 05:31 GMT

నిజామాబాద్ జిల్లాలో టిక్ టాక్ సరదా ముగ్గురు యువకుల ప్రాణాల మీదకు తెచ్చింది. జిల్లాలోని గొప్పల చెక్ డ్యాంలో టిక్ టాక్ చేస్తూ దినేష్ అనే వ్యక్తి పడిపోయాడు. సరదగా ముగ్గురు యువకులు వాగులోకి దిగి వీడియోలు తీసుకొన్నారు. అయితే వాగులో వరద పెరగడంతో ఆ యువకులు కొట్టుకుపోయారు. ఇది గమనించిన స్థానికులు చీరలు విసిరి గంగాజలం, మనోజ్ గౌడ్‌లను కాపాడారు. ఇంద్రపురి దినేష్  గల్లంతు అయ్యాడు. సమాచారం అందుకున్న అధికారులు సంఘటనా ప్రదేశానికి గాలింపు చర్యలు చేపట్టారు. ఉన్నత చదువుల కోసం దినేష్ దుబాయ్ వెుళ్లాడానికి అంతా సిద్దం చేసుకున్నాడు. దినేష్ వాగులో గల్లంతు కావడంతో అతని అ తల్లిదండ్రులు ఆందోళ చెందుతున్నారు.


Full View

Tags:    

Similar News