పోలీసులు ఫొటోలు తీసి ఫైన్ వేస్తున్నారని బైక్‌ను తగలబెట్టిన యువకుడు

* వికారాబాద్ జిల్లా పెద్దేముల్ గ్రామంలో ఘటన * చలానాల తీరుపై యువకుడి ఆగ్రహం * పోలీసుల తీరుపై వాహనదారుడు ఆగ్రహం

Update: 2021-08-08 16:15 GMT

బైక్‌ను తగలబెట్టిన యువకుడు(ఫైల్ ఫోటో)

Vikarabad: వికారాబాద్ జిల్లాలో ఓ వాహనదారుడు కలకలం రేపింది. బైక్ నడిపే సమయంలో నిబంధనలు ఉల్లంఘిస్తున్నాడని పోలీసులు ఫొటోలు తీసి చలాన్‌లు వేయడంతో ఓ యువకుడు ఆగ్రహానికి గురయ్యాడు. పోలీసుల తీరుతో విసుగిపోయిన యువకుడు తన బైక్‌ను పెట్రోల్ పోసి నిప్పు అంటించాడు. ఈ మంటల్లో బైక్ పూర్తిగా కాలిపోయింది. వికారాబాద్ జిల్లా పెద్దేముల్ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

Tags:    

Similar News