Malla Reddy: మంత్రి మల్లారెడ్డి ఇంట్లో ఐటీ సోదాల కేసులో మూడోరోజు విచారణ

Malla Reddy: విచారణకు హాజరుకానున్న మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్‌రెడ్డి..

Update: 2022-11-30 03:21 GMT

Malla Reddy: మంత్రి మల్లారెడ్డి ఇంట్లో ఐటీ సోదాల కేసులో మూడోరోజు విచారణ

Malla Reddy: మంత్రి మల్లారెడ్డి ఇంట్లో ఐటీ సోదాల కేసులో విచారణ కొనసాగుతోంది. ఇవాళ మూడోరోజు విచారణలో భాగంగా.. మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్‌రెడ్డి, మల్లారెడ్డి చిన్న కుమారుడు భద్రారెడ్డితో పాటు ఆడిటర్.. ఐటీ ఎదుట హాజరుకానున్నారు. అలాగే.. మెడికల్‌ కాలేజీ, ఇంజినీరింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ప్రిన్సిపల్స్, డైరెక్టర్లను అధికారులు ప్రశ్నించనున్నారు. ఇప్పటికే.. కాలేజీ సీట్ల కేటాయింపులు, ఫీజుల వివరాలు సేకరించిన ఐటీ.. సీట్‌ పేమెంట్ల బ్యాంక్‌ ఖాతాలపై ఆరా తీయనున్నారు. సీట్‌ పేమెంట్ల చెల్లింపులపై పలు ప్రశ్నలు సంధించనున్నారు.

Full View
Tags:    

Similar News