టీకాంగ్రెస్‌ అంతర్గత కుమ్ములాటలపై హైకమాండ్ సీరియస్‌

T Congress: గీతదాటిన వారిని లైన్‌లో పెట్టేందుకు ఫోకస్

Update: 2022-07-09 08:11 GMT

టీకాంగ్రెస్‌ అంతర్గత కుమ్ములాటలపై హైకమాండ్ సీరియస్‌

T Congress: టీకాంగ్రెస్‌ అంతర్గత కుమ్ములాటలపై హైకమాండ్ సీరియస్‌గా ఉంది. గీతదాటిన వారిని లైన్‌లో పెట్టేందుకు పార్టీ అధిష్టానం ఫోకస్ పెట్టింది. నేతల మధ్య సమన్వయం కోసం విందు రాజకీయాన్ని తెరపైకి తీసుకువచ్చింది. రేపు జూబ్లీహిల్స్ క్లబ్‌లో టీకాంగ్రెస్‌ నేతలకు వర్కింగ్‌ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ విందు ఇవ్వనున్నారు. ఈ విందుకు తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యనేతలు హాజరుకానున్నారు. ఇప్పటికే వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ స్వయంగా కాల్ చేసి విందుకు రావాలంటూ నేతలను ఆహ్వానించారు.

పీసీసీ కార్యవర్గ సభ్యులు, వర్కింగ్‌ ప్రెసిడెంట్లు, సీనియర్ ఉపాధ్యక్షులు, పీఏసీ సభ్యులు, మాజీ మంత్రులు, సీనియర్ నేతలకు విందుకు రానున్న పీసీసీ కార్యవర్గ సభ్యులు, వర్కింగ్ ప్రెసిడెంట్లు సీనియర్ ఉపాధ్యక్షులు, పీఏసీ సభ్యులు, మాజీ మంత్రులు, సీనియర్ నేతలు రానున్నారు. అయితే ఈ విందుకు అసంతృప్తి వాదులు వస్తారా లేదా అన్నది సర్వత్రా ఆసక్తిగా మారింది. 

Tags:    

Similar News