Municipal Elections 2020 : పోలింగ్ డే..లోకల్ హాలిడే
రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగింది. ఈ నెల 22న ఎన్నికలు జరుగుతుండడంతో వాటికి సంబంధించిన ఏర్పాట్లను ఎన్నికల సంఘం ఇప్పటికే పూర్తి చేసింది.
రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగింది. ఈ నెల 22న ఎన్నికలు జరుగుతుండడంతో వాటికి సంబంధించిన ఏర్పాట్లను ఎన్నికల సంఘం ఇప్పటికే పూర్తి చేసింది. ఈ నేథ్యంలోనే ఎన్నికలు జరుగుతున్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో ఈ నెల 22న స్థానిక సెలవు దినంగా ప్రకటించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కలెక్టర్లను ఆదేశించింది. ఓటర్లు http://tsec. gov.in నుంచి స్లిప్పులను డౌన్లోడ్ చేసుకోవాలని ఎస్ఈసీ సూచించింది.
ఈ మేరకు శనివారం ఎస్ఈసీ కార్యదర్శి అశోక్కుమార్ ఉత్తర్వులు జారీచేశారు. ఎన్నికల విధుల్లో 55వేల మంది సిబ్బంది పాల్గొంటున్నారని తెలిపారు. విధుల్లో పాల్గొనేవారు పోస్టల్ బ్యాలెట్ కోసం టీ- పోల్ సాఫ్ట్వేర్ ఫారం-12 ద్వారా 380 మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. మిగిలిన వారు ఆన్లైన్లో పోస్టల్ బ్యాలెట్ కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.