హైదరాబాద్లోని గాంధీ ఆస్పత్రిలో ప్లాస్మా థెరపీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కోవిడ్-19 చికిత్సలో భాగంగా ప్లాస్మా థెరపీకి అనుమతి లభించింది. కరోనా నుంచి కోలుకున్న వారి ప్లాస్మాను వైద్యులు సేకరించనున్నారు. సీరియస్ కండీషన్లో ఉన్నవారికి ఈ ప్లాస్మా థెరపీ ఉపయోగపడనుంది. అలాగే కరోనా సోకి, దాని నుంచి కోలుకున్న ముస్లిం సోదరులు 32 మంది ప్లాస్మా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని తెలంగాణ ఆరోగ్య మంత్రి ఈటెల రాజేందర్, మంత్రి కేటీఆర్కు లేఖలు రాశారు ఎంపీ అసదుద్దీన్.