రైల్వేస్టేషన్లను, రైళ్లను లక్ష్యంగా ముష్కరులు దాడులు చేయవచ్చు.. ఇంటెజెన్స్ హెచ్చరిక
- రైళ్లు, రైల్వే స్టేషన్ల లక్ష్యంగా ఉగ్ర దాడులు జరగొచ్చంటూ ఐబీ హెచ్చరిక - కీలక రైల్వే స్టేషన్లలో ఆర్పీఎఫ్ తనిఖీలు - దేశంలో అన్ని రైల్వేస్షేషన్లలో, రైళ్లలో అప్రమత్తత
దేశంలో ఉగ్రదాడులు జరగవచ్చు నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. ఉగ్రవాదులు ప్రధాన రైల్వేస్టేషన్లను, రైళ్లను లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడే అవకాశముందని ఇంటెలిజెన్స్ బ్యూరో హెచ్చరించింది. దీంతో ముఖ్యమైన రైల్వే స్టేషన్లలో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ తనిఖీలు చేపట్టింది. రైళ్లలో కూడా పటిష్ఠమైన భద్రత ఏర్పాటు చేయనున్నారు. దేశవ్యాప్తంగా అన్ని రైల్వే స్టేషన్లు, రైళ్లలో భద్రత పెంచాలని అధికారులు నిర్ణయించారు.