పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల

Update: 2019-12-03 12:09 GMT
ప్రతీకాత్మక చిత్రం

తెలంగాణలో పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు కౌంట్ డౌన్ మొదలయింది. స్టేట్ బోర్డు సెకండరీ ఎడ్యుకేషన్ ఆఫ్ తెలంగాణ పదోతరగతి పరీక్షల షెడ్యూల్‌ను మంగళవారం విడుదల చేసింది. పరీక్ష తేదీల వివరాలను, పరీక్షలు జరిగే సమయాన్ని సూచించే  టైమ్ టేబుల్ ను అందుబాటులో ఉంచింది. 2020 మార్చి 19వ తేదీ నుంచి 2020 ఏప్రిల్ 06వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు జరగనున్నాయని తెలిపింది. ఈ పరీక్షలు ఉదయం 9:30 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగుతాయని తెలిపారు.

రెగ్యులర్ విద్యార్థులకు ఏప్రిల్ 1వ తేదీన పరీక్షలు ముగుస్తాయని వెల్లడించారు. స్పెషల్ లాంగ్వేజ్ విద్యార్థులకు, ఒకేషనల్ సబ్జెక్ట్ విద్యార్థులకు ఏప్రిల్ 6వ తేదీన పరీక్షలు ముగియనున్నాయని తెలిపారు. విద్యార్థులు బాగా చదివి ఈ పరీక్షల్లో మంచి జీపీఏ తెచ్చుకోవాలని స్టేట్ బోర్డు సెకండరీ ఎడ్యుకేషన్ విద్యార్థులను సూచించింది.


Delete Edit





Tags:    

Similar News