Harish Rao: గాంధీ ఆస్పత్రిలో సీటీస్కాన్‌ ప్రారంభించిన మంత్రి హరీష్‌రావు

* కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి గాంధీ వైద్యులు సేవలందించారు -హరీష్‌ *గాంధీలో పేదలకు కార్పొరేట్‌ వైద్యం అందిస్తున్నాం

Update: 2021-12-11 07:44 GMT

 గాంధీ ఆస్పత్రిలో సీటీ స్కాన్‌ ప్రారంభించిన మంత్రి హరీష్‌రావు

Harish Rao: గాంధీ హాస్పిటల్ సీటీ స్కాన్ యూనిట్ సేవ‌లు అందుబాటులోకి తీసుకువ‌చ్చింది తెలంగాణ స‌ర్కార్. ఆరోగ్యశాఖ మంత్రి హ‌రీష్ రావు గాంధీ ఆసుప‌త్రిలో సీటీ స్కాన్‌ని ప్రారంభించారు. త్వరలో MRI, క్యాత్ ల్యాబ్ ప్రారంభిస్తామ‌ని హారీష్ రావు కీల‌క ప్రక‌ట‌న చేశారు.

తెలంగాణలో ఒమిక్రాన్ కేసు నమోదు కాలేదని హరీష్ రావు చెప్పారు. కరోనా సమయంలో గాంధీ ఆసుపత్రిలోని ప్రతి ఒక్కరూ చేసిన సేవలు పలువురి మన్ననలను పొందాయని ఆయన గుర్తు చేశారు. అలాగే రాష్ట్రంలో కరోనా టెస్టుల సంఖ్య పెంచుతామన్నారు. ప్రజలంతా జాగ్రత్తలు తీసుకోవాలని, మాస్కులు తప్పనిసరిగా ధరించాలని సూచించారు.

Tags:    

Similar News