బాలికల వేధింపులకు గురిచేసిన టీఆర్ ఎస్ నాయకులను పార్టీ సస్పెండ్ చేసినట్లు ఐటీ మంత్రి కేటీఆర్ తెలిపారు. నిందితులపై ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకుంటుంది అని చెప్పారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ఎస్సీ బాలికల హాస్టల్ ను కేటీఆర్ సందర్శించారు. హాస్టల్ లోని సమస్యలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఎస్సీ బాలికల హాస్టల్ కు సొంత భవనాన్ని రెండేళ్లలోపు నిర్మిస్తామని హామీ ఇచ్చారు.