విద్యార్థి అఖిల్‌ పిటిషన్‌పై ఇవాళ కొనసాగనున్న విచారణ

Update: 2019-10-16 05:13 GMT

తెలంగాణ విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్‌పై ఇవాళ మరోసారి హైకోర్టు విచారణ జరపనుంది. దసరా సెలవులు పెంచడం వల్ల విద్యార్థుల చదువులకు ఇబ్బందులు కలుగుతున్నాయని గందరగోళానికి గురవుతున్నారని విద్యార్థి అఖిల్ ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. ఆర్టీసీ సమ్మెకు ప్రత్యామ్నాయం ద్వారా 70 శాతం బస్సులను నడుపుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించిందని అలా అయితే విద్యార్థులకు ఎందుకు సెలవులు ప్రకటించిందని పిటిషన్‌ తరపు న్యాయవాది ప్రశ్నించారు. నిన్న విచారణ సందర్భంగా ఈ రెండింట్లో ఏది వాస్తవమని ధర్మాసం ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఇవాళ ఈ పిటిషన్‌పై చీఫ్‌ జస్టిస్‌ బెంచ్‌పై వాదనలు జరగనున్నాయి.  

Tags:    

Similar News