కోడెల మృతిపై దాఖలైనా పిటిషన్ను విచారణకు స్వీకరించిన హైకోర్టు
కోడెల శివప్రసాద్ మృతిపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్ సీబీఐతో విచారణ జరిపించాలంటూ బి. అనిల్ కుమార్ పిటిషన్ విచారణకు స్వీకరించిన తెలంగాణ హైకోర్టు
ఆంధ్రప్రదేశ్ మాజీ శాసనసభాధిపతి కోడెల శివప్రసాద్ ఆత్మహత్యపై సీబీఐ విచారణ జరిపించాలని దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. అయితే ఈనెల 16వతేదీన కోడెల శివప్రసాద్ హైద్రాబాద్ లో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. కోడెలది ఆత్మహత్య అనుమానాలు ఉన్నాయంటూ అనిల్ బూరగడ్డ పిటిషన్ ని తెలంగాణ హైకోర్టులో దాఖలు చేశారు. సిబీఐ విచారణకు ఆదేశించాలని ఆయన కోరారు. కాగా... ఈ పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు నేడు విచారణకు స్వీకరించింది. దీనిపై ఇవాళ మధ్యాహ్నం విచారణ జరుపనున్నట్లు కోర్టు ప్రకటించింది.