బీసీ రిజర్వేషన్ల విచారణపై తెలంగాణ సర్కార్ కీలక సమావేశం
బీసీ రిజర్వేషన్ల విచారణపై తెలంగాణ సర్కార్ కీలక సమావేశం నిర్వహిస్తోంది. రేపు హైకోర్టులో రిజర్వేషన్లపై స్టే ఇవ్వాలని కోరుతూ వేసిన పిటిషన్పై విచారణ జరగనుంది.
బీసీ రిజర్వేషన్ల విచారణపై తెలంగాణ సర్కార్ కీలక సమావేశం నిర్వహిస్తోంది. రేపు హైకోర్టులో రిజర్వేషన్లపై స్టే ఇవ్వాలని కోరుతూ వేసిన పిటిషన్పై విచారణ జరగనుంది. వాదనల నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహంపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు ఉత్తమ్, శ్రీహరి, పొన్నం హాజరయ్యారు. మరోవైపు సుప్రీంకోర్టులో రిజర్వేషన్లపై స్టే కోరుతూ వేసిన పిటిషన్పై వాదనలు వినిపించిన అభిషేక్ సింఘ్వికి సీఎం రేవంత్ ఫోన్ చేశారు. హైకోర్టులో వాదనలు వినిపించాలని కోరారు.