Telangana: ఒమిక్రాన్‌పై తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తం

మాస్క్ ధరించని వారికి వెయ్యి రూపాయల ఫైన్ వ్యాక్సిన్ సర్టిఫికెట్‌ లేనివారికి ఎక్కడికెళ్లినా నో ఎంట్రీ రూల్

Update: 2021-12-03 04:20 GMT

ఒమిక్రాన్‌పై తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తం

Telangana: ఒమిక్రాన్ పై తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. విదేశాలనుంచి వచ్చిన 325 మంది ప్రయాణికులకు పరీక్షలు చేయగా అందులో ఓ మహిళకు కరోనా పాజిటివ్ గా తేలింది. 35 ఏళ్ల ఆ మహిళకు టిమ్స్ లో ట్రీట్ మెంట్ ఇప్పిస్తున్నట్లు ఆమె నమూనాలను జినోమ్ సీక్వెన్సింగ్ కి పంపినట్లు తెలంగాణ హెల్త్ డైరక్టర్ శ్రీనివాస రావు తెలిపారు. ఒమిక్రాన్ రాకుండా తెలంగాణ ప్రభుత్వం పకడ్బందీ నిబంధనలను కూడా రూపొందిస్తోందని మాస్క్ ధరించని వారికి వెయ్యిరూపాయల జరిమానా విధించే ఆలోచనలో కూడా ఉన్నట్లు హెల్త్ డైరెక్టర్ తెలిపారు.

Tags:    

Similar News