తెలంగాణలో దూకుడు పెంచిన కమలం పార్టీ

BJP: ఢిల్లీకి తెలంగాణ ఈటల, డీకే అరుణ

Update: 2022-08-01 05:20 GMT

తెలంగాణలో దూకుడు పెంచిన కమలం పార్టీ

BJP: తెలంగాణలో కమలం పార్టీ దూకుడు పెంచింది. ఈటల, డీకే అరుణ ఢిల్లీకి బయల్దేరారు. బీజేపీలో చేరేవారి లిస్ట్‌ను హైకమాండ్‌కు అందజేయనున్నారు. జిల్లాల వారీగా బీజేపీలో జాయిన్ అయ్యేవారి లిస్ట్‌ను చేరికల కమిటీ ఇప్పటికే సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. జాతీయ నేతల పర్మిషన్ రాగానే ఆపరేషన్ ఆకర్ష్‌కు తెరతీయనుంది కమలం పార్టీ. బీజేపీలో చేరేవారి లిస్ట్‌లో పలువురు టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు ఉన్నట్లు సమాచారం. రేపటి నుంచి బండి సంజయ్ మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభంకానుంది. ఒకవైపు బండి సంజయ్ పాదయాత్ర మరోవైపు కొత్తవారి చేరికలతో తెలంగాణ బీజేపీ దూకుడు పెంచనుంది.

Tags:    

Similar News