కరోనా నేపద్యంలో తెలంగాణకు కేంద్ర బలగాలు వస్తున్నాయంటూ వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. తెలంగాణకు కేంద్ర బలగాలు కావాలని కోరలేదని, ఆ అవసరం కూడా లేదని తెలిపారు. కాగా, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో కరోనా నేపథ్యంలో హైఅలర్ట్ కొనసాగుతోంది. దోమలగూడ, బౌద్ధనగర్, సికింద్రాబాద్, చందానగర్, కోకాపేట, మణికొండ ప్రాంతాల్లో ఇంటింటికి సర్వే నిర్వహిస్తున్నారు. ఆశావర్కర్లు, ఏఎన్ఎమ్లు అనారోగ్యంతో ఉన్నవారి వివరాలను సేకరిస్తున్నారు.